వార్తలకు తిరిగి వెళ్లండి
మూతపడిన బిల్ట్ కంపెనీని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగపేట మండలం కమలాపురంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బిల్ట్ కంపెనీ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కార్మికులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కంపెనీ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Comments
Loading comments...

