Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీపై మంత్రి పొంగులేటి ఆరోపణలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 19, 2026 5:47 PM ఖమ్మంGeneral
బీజేపీపై మంత్రి పొంగులేటి ఆరోపణలు - Udayam
బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపూరిత రాజకీయాలకు ఒడిగడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అనే ప్రక్రియను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు.

Comments

G
Loading comments...