Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజన నిర్వాహాకులపై ఆగ్రహం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 03, 2026 4:24 PM నంద్యాలGeneral
భోజన నిర్వాహాకులపై ఆగ్రహం - Udayam
ప్యాపిలి మండలం పీ అర్ పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ ఎంపీడీఓ ప్రభాకర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం తనిఖీ చేశారు. కోడి గుడ్డు కర్రీ చాలా పల్చగా చేసినట్లు గుర్తించిన డిప్యూటీ ఎపీడీఓ నిర్వాహకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట వంట సరిగా చేయకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని వంట చేసే నిర్వాహకులను హెచ్చరించారు.

Comments

G
Loading comments...