వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామ కాలనీలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. గ్రామస్థులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, హారతులు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

