వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ బడిమెలలో వెంటనే అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామంలో 44 మంది చిన్నారులు అంగన్వాడీ సేవలు పొందుతున్నారని తెలిపారు.
భవనం లేక ఆయా ఇంటి వద్దే పౌష్టికాహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్థులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

