వార్తలకు తిరిగి వెళ్లండి
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కళ్యాణ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు.
లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దాతల సహకారంతో అల్పాహారం, భోజన వసతి కల్పించామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో వేడుక జరిగేలా సహకరించాలని కోరారు.
Comments
Loading comments...