వార్తలకు తిరిగి వెళ్లండి
బహదూర్గూడ భూములపై స్టే

రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూముల్లోని నిర్మాణాలపై తదుపరి ఉత్తర్వుల వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. నివాసాల కూల్చివేతను సవాలు చేస్తూ బాధితులు వేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది.
భూ హక్కులపై వివాదం ఉన్నందున ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ఎలాంటి చర్యలు వద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
Comments
Loading comments...