వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం ఆసోదివారిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా వైద్యాధికారి విజయమ్మ బుధవారం తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, తల్లులు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు.
తదుపరి టీకాల కోసం పిల్లలను క్రమం తప్పకుండా ఆరోగ్య కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తనిఖీలో ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

