వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని బాజీ బాబా దర్గాలో చేపట్టిన హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం హుండీల లెక్కింపులో రూ.65,44,441 నగదు, 29 గ్రాముల బంగారం, 182 గ్రాముల వెండి లభించినట్లు దర్గా ఈవో షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు.
వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ, పోలీసుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించినట్లు చెప్పారు. లభించిన నగదు, బంగారం, వెండిని నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డుకు జమ చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

