Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాదంపప్పుతో బప్పా.. అదుర్స్

Follow Udayam on Google
B RAJESH Sep 14, 2026 6:50 PM విజయనగరంGeneral
రాజాంలో వినాయక చవితి సందర్భంగా వెరైటీ గణేశుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్న చెరువుగట్టు యూత్ ఆధ్వర్యంలో రూ.20 వేల వ్యయంతో 10 కిలోల బాదంపప్పును ఉపయోగించి వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. సుమారు 15 రోజులపాటు శ్రమించి తయారు చేసిన ఈ విగ్రహం పట్టణవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...