వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సమన్లు, వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు.
కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ-పెట్టీ కేసులు, ట్రయల్స్ పురోగతిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. వారెంట్ల అమలులో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ సేవలను, సాంకేతికతను వాడుకోవాలని, ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
Comments
Loading comments...

