Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డతీగలలో పట్టు పంటపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:36 PM అల్లూరి General
అడ్డతీగలలో పట్టు పంటపై అవగాహన - Udayam
అడ్డతీగల మండలం తిమ్మాపురంలో గురువారం పట్టు పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టు పంటతో రైతులు సుస్థిర ఆదాయం పొందవచ్చని కేంద్ర పట్టు మండలి శాస్త్రవేత్త నాయక్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టుకు డిమాండ్‌ పెరుగుతుందని నాయక్‌ చెప్పారు. పోలవరం, అల్లూరి జిల్లాల్లో నీటి వసతి ఉన్న భూముల రైతులు ముందుకొస్తే ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏ.డీ. పాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...