వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
నల్లబెల్లి మండలం మేడపల్లి రైతు వేదికను పరిశీలించిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

