వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరు మండలం పాలకాయతిప్పలోని అవుట్ఫాల్ స్లూయిస్కు మరమ్మతులు చేయించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు స్లూయిస్ను పరిశీలించి, వేలాది ఎకరాల భూముల రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
సముద్రం నుంచి ఉప్పునీరు బయటకు రావడంతో పండిన పంటలు పనికి రాకుండా పోతున్నాయని వారు పేర్కొన్నారు. రైతుల నష్టాలను నివారించేందుకు స్లూయిస్కు మరమ్మతులు చేయించాలని కోరారు.
Comments
Loading comments...

