వార్తలకు తిరిగి వెళ్లండి

మినిస్టర్ క్వార్టర్స్లో కేకేసీ యూనియన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి, ఆటో కార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో ఛార్జీలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తుందనే ప్రచారాన్ని ఖండించారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
Comments
Loading comments...

