వార్తలకు తిరిగి వెళ్లండి

కంఠెవరంలో న్యాయవాది ఖాదర్ హుస్సేన్, ఆయన కుటుంబంపై దాడి, సామగ్రి ధ్వంసం, బెదిరింపుల కేసులో మండలాధ్యక్షుడు, వైకాపా నేత ధర్మరాజుల చెన్నకేశవులు, ఆయన ముగ్గురు అనుచరులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

