వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కుట్టు మిషన్ స్టిచ్చింగ్ సెంటర్ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడమే లక్ష్యమని తెలిపారు.
కేంద్రంలో 50 కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారు. తొలి బ్యాచ్లో 100 మంది మహిళలకు ఉచిత శిక్షణతో పాటు మార్కెట్ లింకేజీ కల్పించి యూనిఫాంలు, స్కూల్ డ్రెస్లు, బ్యాగుల ఆర్డర్లు అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

