Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసియాన్ ఫోరం లో పాకిస్తాన్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 24, 2026 11:23 AM జాతీయంGeneral
అసియాన్ ఫోరం లో పాకిస్తాన్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్ - Udayam
ఆసియాన్ రీజినల్ ఫోరంలో కశ్మీర్, సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ వేదికలను పాక్ దుష్ప్రచారానికి వాడుకుంటోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఉగ్రవాదాన్ని ఆపేంతవరకు సింధు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...