Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపరాల సాగుపై రైతులకు వ్యవసాయ అదికారి అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 9:49 PM విజయనగరంGeneral
అపరాల సాగుపై రైతులకు వ్యవసాయ అదికారి అవగాహన - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామంలో వ్యవసాయ అదికారి శ్యాం సుందర్ ఆద్వర్యంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన రైతులకు అపరాల సాగుపై సామర్ధ్య పెంపు శిక్షణతో కిసాన్‌ గోష్టి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయలేని రైతులకు ప్రత్యామ్నాయంగా అపరాల పంటను సాగు చేసుకోవచ్చన్నారు. అనంతరం పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...