వార్తలకు తిరిగి వెళ్లండి
మిష్టి పథకంలో ఏపీకి దేశంలో రెండో స్థానం

మిష్టి (MISHTI) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
2,047 హెక్టార్లకు పైగా మడ అడవుల పునరుద్ధరణ, తీరప్రాంత పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, సుస్థిర అభివృద్ధి దిశగా ఈ ప్రయత్నాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...