వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి పాతవూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 5 ఏళ్లు నిండిన విద్యార్థులకు డీటీపీ, 10 ఏళ్లు పూర్తయిన వారికి టీడీ టీకాలు వేశారు.
వ్యాధులు దరిచేరకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లు వేయించడం ఎంతో అవసరమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత తెలిపారు. చిన్నతనంలోనే తగిన టీకాలు ఇప్పించడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

