Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌ఎం ఆత్మహత్య తీవ్ర విషాదం

ధీరజ్ రెడ్డి Jul 23, 2026 8:59 PM నెల్లూరుabout 1 hour ago
ఏఎన్‌ఎం ఆత్మహత్య తీవ్ర విషాదం - Udayam Digital
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌ఎం శ్రీపతి సాయి చందన ప్రియ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు తన ఇన్సూరెన్స్ డబ్బుతో వైద్యం చేయించుకోవాలని సూచిస్తూ ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...