వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపేట మండలం చల్లూరు పరిధిలోని మల్లాయి చెరువు ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రైతులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 223, 224లోని చెరువు భూమిలో జేసీబీలతో చేపట్టిన పనులను వారు అడ్డుకున్నారు.
చెరువు శిఖం, కట్టను తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై గ్రామ పంచాయతీతో పాటు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చెరువు భూమిని కాపాడాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

