వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్పల్లి 14వ వార్డు అంగన్వాడి కేంద్రంలో శనివారం సీమంతం, అన్నప్రాసన, టీహెచ్ఆర్ పంపిణీ నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ పాల్గొని గర్భిణీలకు, బాలింతలకు పలు సూచనలు చేశారు.
ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన చేసి, బాలమృతం ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ, టీచర్ రజిని, వైద్య సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

