వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రా జలాశయం నుండి సాగునీటి విడుదల

మెంటాడ మండలంలోని ఆంధ్రా జలాశయం నుండి ఖరీఫ్ సీజన్ కోసం సాగునీటిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తోందని, ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
జలాశయాల నిర్వహణకు తగిన నిధులు మంజూరు చేస్తూ, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...