వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి–చిన్నశంకరంపేట మార్గంలోని రైల్వే అండర్పాస్లో చిరుజల్లులకే నీరు నిలుస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో ఇసుక, మట్టి పేరుకుపోవడంతో నీరు బయటకు వెళ్లడం లేదన్నారు.
అడుగులోతు వరకు నీరు నిలవడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

