వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 5న మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు డీసీపల్లి గ్రామంలో సీజీఎఫ్ నిధులు రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం ఉదయం 11 గంటలకు పొంగూరు కండ్రిగ జాతీయ రహదారి వద్ద ఉన్న శ్రీ అచ్చమ్మాంబ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించనున్నారు.
Comments
Loading comments...

