వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు మండలం కమ్మరచెడు గ్రామ సమీపంలోని ఆదోని వెళ్లే దారిలో బ్రహ్మయ్యస్వామి దేవాలయం వద్ద ఈరోజు సాయంత్రం 7 గంటలకు అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఓ మహిళ వెంటనే శిశువును తన ఇంటికి తీసుకెళ్లి మానవత్వం చాటుకుంది.
కన్నబిడ్డను కాదనుకున్న వారి హృదయాలు రాయిగా మారాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయాలను కలచేసింది.
Comments
Loading comments...

