వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో జిల్లా జనగణన హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ) తయారీ కోసం క్షేత్రస్థాయి సమాచార సేకరణ ప్రారంభమైనట్లు డీఆర్వో ఎంవీఎస్ లోకేశ్వరరావు తెలిపారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా గ్రామాలు, పంచాయతీల్లో సర్వే నిర్వహించనున్నారు.
జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేయనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు.
Comments
Loading comments...

