వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో నిర్మాణ నాణ్యతపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గోడలకు పగుళ్లు, పునాదులు కుంగిపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
తాడిపత్రి, గుత్తి తదితర ప్రాంతాల్లో భవనాల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. నాసిరకం పనులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

