వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి తెలుగు సమితి అంతర్జాల సదస్సులో లక్ష్మీ అహల తన తొమ్మిదవ అష్టావధానాన్ని పూర్తి చేశారు. పృచ్ఛకుల సవాళ్లకు పద్యాలతో బదులిచ్చి తన అసాధారణ ధారణా ప్రతిభను నిరూపించుకున్నారు.
ఈ విజయం బాలిక ప్రతిభే కాక, భావితరాల్లో తెలుగు సాహిత్యం సజీవంగా ఉందని నిరూపించిందని డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్ కొనియాడారు. అధ్యక్షులు డాక్టర్ కల్లూరి సుందర రామ మూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

