వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి భీమవరం వెళ్తున్న లారీ రహదారి విస్తరణ పనులతో అసంపూర్తిగా ఉన్న మార్గంలో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ క్రమంలో పోరుమామిళ్ల నుంచి ఎర్రగుంట్ల వెళ్తున్న కారును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.
Comments
Loading comments...

