Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట కుంటలు, గిరిజన పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 8:47 PM జోగులాంబ గద్వాల్ General
పంట కుంటలు, గిరిజన పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ - Udayam
గద్వాల మండలం బసల్ చెరువులో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పంట కుంటల పనులను అదనపు కలెక్టర్ బి. నర్సింగ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పుటాన్‌పల్లి గిరిజన పాఠశాలను సందర్శించి విద్య, వసతి, భోజనం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...