Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త కారుకు పూజ చేస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:47 PM హైదరాబాద్General
కొత్త కారుకు పూజ చేస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి - Udayam
జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో కొత్త కారుకు పూజ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తుమ్ములపల్లి రామచంద్రరావు(70) మృతి చెందారు. మేనల్లుడు సాయికుమార్‌ కారును ముందుకు నడిపే క్రమంలో బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ తొక్కడంతో వాహనం రామచంద్రరావును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...