Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ బంద్‌తో విశాఖలో నిలిచిన కాలేజీ బస్సులు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 05, 2026 7:01 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఏబీవీపీ బంద్‌తో విశాఖలో నిలిచిన కాలేజీ బస్సులు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, డిగ్రీ అడ్మిషన్లు పూర్తి చేయాలని కోరుతూ ఏబీవీపీ ఇచ్చిన బంద్ పిలుపుతో విశాఖలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. ఎండాడ జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కళాశాల బస్సులను కార్యకర్తలు నిలిపివేశారు. బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్దిలపాలెం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Comments

G
Loading comments...