వార్తలకు తిరిగి వెళ్లండి

స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా మంగళవారం కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాలలో బంద్ నిర్వహించారు. వివిధ గ్రూపులకు చెందిన విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.
విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవడంతో కళాశాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

