వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి వేగంగా సాగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండలం మధుపాడలో రూ.57.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆదివారం ప్రారంభించారు.
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. గజపతినగరంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
