వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలైనా వికారాబాద్ జిల్లాలో యూనిఫాం పంపిణీ పూర్తికాలేదు. మొత్తం 93,205 మంది విద్యార్థులకు 1,86,410 జతలు అందించాల్సి ఉంది. మహిళా సంఘాల సభ్యులు ఇప్పటివరకు 45,885 జతలు మాత్రమే కుట్టారు.
పంద్రాగస్టు నాటికి ప్రతి ఒక్కరికీ బట్టలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా, మరో 4 రోజులే ఉండటంతో ఆగస్టు 15 నాటికి అందరికీ యూనిఫామ్లు అందుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

