వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైతలాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. లాటరీ ప్రక్రియ లేకుండా 104 ఇళ్లను కేటాయించారని, ఇతర జిల్లాలకు చెందిన వారికి, ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికి కూడా ఇచ్చారని అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఐఏఎస్ అధికారుల సిఫార్సులతో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు అందించారని విమర్శించారు. అన్యాయం జరిగితే నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

