Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల దీక్షను జయప్రదం చేయాలంటూ కరపత్రాల విడుదల

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 28, 2026 4:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
24 గంటల దీక్షను జయప్రదం చేయాలంటూ కరపత్రాల విడుదల - Udayam
గోరంట్ల గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల వలె రూ. 26 వేల జీతం ఇవ్వాలంటూ ఈనెల 31 చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని సి ఐ టి యు, నాయకులు లక్ష్మీనారాయణతో కలసి కరపత్రాలు విడుదల చేసిన పారిశుద్ధ కార్మికులు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అని కోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...