Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20న మునిగోనిపల్లి — కురుమూర్తి డబుల్ రోడ్డు పనులకు భూమిపూజ

Follow Udayam on Google
anji kummari Sep 16, 2026 7:09 PM మహబూబ్‌నగర్General
20న మునిగోనిపల్లి — కురుమూర్తి డబుల్ రోడ్డు పనులకు భూమిపూజ - Udayam
దేవరకద్ర నియోజకవర్గంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. దేవరకద్ర మండలంలోని మునిగోనిపల్లి, కురుమూర్తి డబుల్ రోడ్డు పనులకు ఈ నెల 20న భూమిపూజ చేయనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి లు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే సోదరుడు భాస్కర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, పనుల పురోగతిని జి. భాస్కర్ రెడ్డి పరిశీలించారు.

Comments

G
Loading comments...