వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మండలం కర్లపూడిలో బుధవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నేతృత్వంలో '2 ఏళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచారం జరిగింది. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లిన ఆయన, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 90% హామీలు నెరవేర్చామని, అందుకే ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

