వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట, ఇందిరానగర్ కాలనీకి చెందిన శ్యామల (25) ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని మంగళవారం పోలీసులు తెలిపారు.
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్యామల ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా అల్వాల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...
