వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై విలే పార్లే వెస్ట్లోని 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. 11వ అంతస్తులో చెలరేగిన మంటల్లో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
సుమారు 4 వేల చదరపు అడుగుల్లో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రికి అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

