Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి మృతితో బంధువుల ఆందోళన

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 12, 2026 9:50 PM హైదరాబాద్తెలంగాణ
యువకుడి మృతితో బంధువుల ఆందోళన - Udayam
మేడ్చల్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాళ్లకల్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థి అజయ్‌(23) మృతి చెందాడు. గత నెల 18న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది అని తండ్రి సభాపతి శర్మ తెలిపారు. వైద్యానికి ఇప్పటికే రూ.16 లక్షలు చెల్లించామని, మరో రూ.5 లక్షలు అడిగారని ఆయన తెలిపారు. సరైన సదుపాయాలు లేకున్నా 25 రోజులు చికిత్స కొనసాగించారని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...