వార్తలకు తిరిగి వెళ్లండి
పోక్సో భయంతో యువకుడి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా ఎర్దనూరుకు చెందిన నవీన్ కుమార్(27) పోక్సో కేసులో శిక్ష పడుతుందనే భయంతో ఉరేసుకుని చనిపోయాడు. 2022లో ఇతడిపై నర్సాపూర్ ఠాణాలో కేసు నమోదైంది.
గత కొన్ని రోజులుగా కోర్టుకు వెళ్లని నవీన్, జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి ఇంట్లో ప్రాణాలు తీసుకున్నాడు. భార్య శ్వేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...