వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల యువకుడు రెండో నంబర్ ప్లాట్ఫాం సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం యువకుడిని మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

