వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని ఓ ఫామ్హౌస్లో జరిగిన వీకెండ్ పార్టీలో గండ్ల రాము (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో ఈతకొలనులో మృతి చెందాడు. పార్టీలో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.
రాము మృతదేహంపై గాయాలు ఉండటంతో, అతడిని హత్య చేశారని తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అక్కడ ఉన్న స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

