వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో మైనర్లను మచ్చిక చేసుకుని ఇళ్ల నుంచి బంగారు ఆభరణాలు తెప్పించిన కేసులో ధనుష్ అనే యువకుడిని మూడో ఠాణా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పది తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మైనర్లతో స్నేహం చేసి వారి ద్వారా ఆభరణాలు తెప్పించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

