Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు జలాశయంలో మునిగి యువకుడు మృతి

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Aug 03, 2026 11:43 AM కరీంనగర్తెలంగాణ
మానేరు జలాశయంలో మునిగి యువకుడు మృతి - Udayam Digital
స్నేహితుల దినోత్సవం సందర్భంగా మానేరు జలాశయం వద్దకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా అల్గునూర్‌కు చెందిన మణిప్రసాద్‌(23) స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జలాశయంలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...