వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుల దినోత్సవం సందర్భంగా మానేరు జలాశయం వద్దకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా అల్గునూర్కు చెందిన మణిప్రసాద్(23) స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జలాశయంలో మునిగిపోయాడు.
స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
